Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారాన్ని పోలిన శాకాహారం: జెనీలియా దంపతుల కొత్త బిజినెస్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (13:55 IST)
బాలీవుడ్ ప్రేమ దంపతులు రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా కొత్త బిజినెస్‌ ప్రారంభించింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించిన జెనీలియా ఆపై బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్‌ను వివాహం చేసుకొని ముంబైలో సెటిల్ అయ్యింది. అయితే, ఈ సెలెబ్రిటీ కపుల్స్ గత నాలుగేళ్లుగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో మాంసం ముట్టుకోకూడదని తీర్మానించారు. 
 
ఈ జంట అప్పటి నుంచి శాకాహారమే తీసుకుంటున్నారు. అయితే, రుచిలోనూ, వాసనలోనూ, పోషక పదార్ధాల్లోనూ మాంసాన్ని తలపించేలా కొన్ని మొక్కలు ఉన్నాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వాటిని తీసుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈ సెలెబ్రిటీ జంట వాటిని ఆహారంలో వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మొక్కలతో తయారయ్యే ఆహారాన్ని భారత్‌లో ఉత్పత్తి చేయాలని జెనీలీయా దంపతులు భావించారు. ఇందులో భాగంగా మాంసాహారాన్ని పోలిన రుచికరమైన శాకాహారాన్ని ప్రజలకు అందజేయాలని భావిస్తున్నారు. 
 
ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ ల్యాండ్ గుడ్ పుడ్స్‌ ఇనిస్టిట్యూట్‌ కలిసి జెనీలియా దంపతులు ఇమేజిన్ మీట్ పేరుతో భారత్‌లో బిజినెస్‌ను లాంచ్ చేయబోతున్నారు. ఈ ఇమేజిన్ మీట్ ద్వారా బిర్యానీ, కబాబ్ వంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చని ఈ సెలెబ్రిటీ కపుల్స్ చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య.. ఎక్కడ?

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఘర్షణ.. పవన్ కల్యాణ్ సీరియస్

కర్ణాటకలో ఘోరం.. ప్రేమకు ఓకే చెప్పలేదని.. కారులో ఎక్కించుకుని సరస్సులో నెట్టేశాడు..

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments