Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారాన్ని పోలిన శాకాహారం: జెనీలియా దంపతుల కొత్త బిజినెస్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (13:55 IST)
బాలీవుడ్ ప్రేమ దంపతులు రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా కొత్త బిజినెస్‌ ప్రారంభించింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించిన జెనీలియా ఆపై బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్‌ను వివాహం చేసుకొని ముంబైలో సెటిల్ అయ్యింది. అయితే, ఈ సెలెబ్రిటీ కపుల్స్ గత నాలుగేళ్లుగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో మాంసం ముట్టుకోకూడదని తీర్మానించారు. 
 
ఈ జంట అప్పటి నుంచి శాకాహారమే తీసుకుంటున్నారు. అయితే, రుచిలోనూ, వాసనలోనూ, పోషక పదార్ధాల్లోనూ మాంసాన్ని తలపించేలా కొన్ని మొక్కలు ఉన్నాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వాటిని తీసుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈ సెలెబ్రిటీ జంట వాటిని ఆహారంలో వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మొక్కలతో తయారయ్యే ఆహారాన్ని భారత్‌లో ఉత్పత్తి చేయాలని జెనీలీయా దంపతులు భావించారు. ఇందులో భాగంగా మాంసాహారాన్ని పోలిన రుచికరమైన శాకాహారాన్ని ప్రజలకు అందజేయాలని భావిస్తున్నారు. 
 
ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ ల్యాండ్ గుడ్ పుడ్స్‌ ఇనిస్టిట్యూట్‌ కలిసి జెనీలియా దంపతులు ఇమేజిన్ మీట్ పేరుతో భారత్‌లో బిజినెస్‌ను లాంచ్ చేయబోతున్నారు. ఈ ఇమేజిన్ మీట్ ద్వారా బిర్యానీ, కబాబ్ వంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చని ఈ సెలెబ్రిటీ కపుల్స్ చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments