Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరు మూవీలో జెనీలియా నటిస్తుందా? ఈ వార్త నిజమేనా?

చిరు మూవీలో జెనీలియా నటిస్తుందా? ఈ వార్త నిజమేనా?
, గురువారం, 21 మే 2020 (23:24 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నతాజా చిత్రం ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
కరోనా వలన షూటింగ్‌కి బ్రేక్ పడడంతో ఆచార్య రావడం ఆలస్యం అవుతుంది. లేదంటే... ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రావాలి. తాజా సమాచారం ప్రకారం.... ఆచార్య సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడని టాక్ వినిపిస్తోంది. 
 
ఇదిలా ఉంటే... చిరు మూవీలో జెనీలియా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాలో అంటే... లూసీఫర్ రీమేక్‌లో అని తెలిసింది. ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్‌లో నటించనున్నారు.
 
ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్త నిజమేనా కాదా అనేది ఆసక్తిగా మారింది. పెళ్లైన తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉంది.
 
అలాంటిది చిరు మూవీలో జెనీలియా నటిస్తుంది అంటూ టాక్ రావడంతో హాట్ టాపిక్ అయ్యింది. మరి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న చిరంజీవి ప్రచారంలో ఉన్న ఈ వార్తపై స్పందిస్తారేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని ప్రయోగం ఫలించేనా..?