Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినీ రచయిత - డబ్బింగ్ ఆర్టిస్ట్ - దర్శకుడు శ్రీరామకృష్ణ కన్నుమూత

ఠాగూర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (10:26 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, సినీ దర్శకుడు శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. బొంబాయి, జెంటిల్‌మేన్, చంద్రముఖ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలతో పాటు.. సుమారుగా 300కు పైగా చిత్రాలకు ఆయన సినీ రచయితగా పని చేశారు. బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ వంటి చిత్రాలకు కూడా దర్శకత్వం కూడా వహించారు. 
 
శ్రీరామకృష్ణ స్వస్థం గుంటూరు జిల్లా తెనాలి. అనువాద రచనలో రాజశ్రీ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్న శ్రీరామకృష్ణ... మణిరత్నం, శంకర్ వంటి దిగ్గజ దర్శకులు దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు తెలుగులో మాటలు రాశారు. రజనీకాంత్ దర్బార్ చిత్రానికి చివరిగా మాటలు అందించారు. ఆయన పార్థివదేవానికి మంగళవారం ఉదయం చెన్నై సాలిగ్రామంలోని శ్మాశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమన్ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

Best tourism villagesగా నిర్మల్, సోమశిల

ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్ల సాయం

డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమల పర్యటన రద్దు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments