Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావత్ అశ్లీల సినిమా.. అస్సలు చూడొద్దు.. ఓవైసీ అసదుద్ధీన్

పద్మావతి సినిమా 'పద్మావత్‌'గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీపికా ప‌దుకొణే, షాహిద్ క‌పూర్‌, ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం ప‌ద్మావ‌త్‌ సినిమా జ‌న‌వ‌రి 25న విడుదల కానుంది. ప్ర

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (13:35 IST)
పద్మావతి సినిమా 'పద్మావత్‌'గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీపికా ప‌దుకొణే, షాహిద్ క‌పూర్‌, ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం ప‌ద్మావ‌త్‌ సినిమా జ‌న‌వ‌రి 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ తెలుగు అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. 
 
ఈ సినిమాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఒక కట్టు కథ అన్నారు. అంతటితో ఆగకుండా ముస్లింలు ఎవ్వరూ పద్మావత్‌ను చూడవద్దన్నారు. ఈ సినిమా కోసం డబ్బు, సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దునని ఓవైసీ సూచించారు. పద్మావత్ లాంటి అశ్లీల సినిమాలు చూడవవద్దన్నారు. 1540 నాటి చరిత్ర అంటూ ముస్లిం కవి మల్లిక్ మహ్మద్ రాసిన ఫిక్షన్ కథే ఇదన్నారు
 
ఈ సినిమాను అడ్డుకునేందుకు ప్రధాని మోదీ 12 మంది సభ్యులతో కమిటీని నియమించారని ఓవైసీ చెప్పుకొచ్చారు. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ, ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని ఆరోపించారు. 
 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments