Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పద్మావతి'కి ఓకేగానీ... 300 కట్స్ అవాస్తమట...

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "పద్మావతి". ఈ చిత్రం డిసెంబర్ ఒకటో తేదీనే రిలీజ్ కావాల్సి ఉంది.

'పద్మావతి'కి ఓకేగానీ... 300 కట్స్ అవాస్తమట...
, బుధవారం, 10 జనవరి 2018 (13:53 IST)
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "పద్మావతి". ఈ చిత్రం డిసెంబర్ ఒకటో తేదీనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, రాజ్‌పుత్ కర్ణిసేన వర్గం నేతలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్రం విడుదలకు నో చెప్పాయి. దీంతో చిత్రం విడుదలను వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీకి 300 కట్స్ చెప్పినట్లు మీడియాలో ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఢిల్లీ, చిత్తోర్‌గఢ్, మేవార్‌కు సంబంధించిన అన్ని సీన్లు కట్ చేయాలని సీబీఎఫ్‌సీ.. భన్సాలీకి చెప్పినట్లు ముంబై మిర్ర‌ర్ పత్రిక రాసుకొచ్చింది. 
 
ఈ కథనంపై సీబీఎఫ్‌సీ ఛైర్మ‌న్ ప్ర‌సూన్ జోషి స్పందించారు. చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రించార‌ని క‌ర్ణిసేన ఆరోప‌ణలు చేసిన నేప‌థ్యంలో మూవీ టైటిల్‌ని పద్మావత్‌గా మార్చాలని చిత్ర యూనిట్‌కి తెలిపామ‌ని, అంతేకాకుండా సతిని ఎక్కువ చేసి చూపకూడదని, ఘూమర్ సాంగ్‌లో కేరక్టర్‌కు తగిన మార్పులు చేయాలని చెప్పినట్లు వివరించారు. 
 
రాజ్‌పుత్‌లు, చ‌రిత్ర‌కారుల స‌ల‌హా క‌మిటీ మేర‌కు కేవ‌లం ఐదు చిన్న స‌వ‌ర‌ణ‌లు మాత్ర‌మే చేసిన‌ట్లు ప్ర‌సూన్ పేర్కొన్నారు. అంద‌రి మ‌నోభావాల‌ను దృష్టిలో ఉంచుకుని అవ‌స‌ర‌మైన విధంగా సినిమాను ఎడిట్ చేసిన‌ట్లు తెలిపారు. 300 క‌ట్స్ చేసామ‌ని వార్త‌లు రాసి, సీబీఎఫ్‌సీ ప‌రువు తీయోద్ద‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ మానియా.. ఒక్క షో పడకుండానే రికార్డులు... ఎక్కడ?