Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజైరబుల్ ఉమెన్ జాబితాలో అగ్రస్థానంలో 'లోఫర్' బ్యూటీ

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (11:59 IST)
ప్రముఖ పత్రిక టైమ్స్ తాజాగా టాప్ - 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో దిశా పటానీ అగ్రస్థానంలో నిలిచింది. గ‌త ఏడాది ఈ భామ ఇదే జాబితాలో 9వ ర్యాంక్‌లో ఉండగా, ఈ సారి ఏకంగా మొదటి స్థానానికి చేరడం విశేషం.
 
ఈ 'లోఫర్' బ్యూటీ తొలి స్థానాన్ని దక్కించుకోవడానికి కారణం లేకపోలేదు. ఇటీవ‌ల బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేయ‌డం, మంచి స‌క్సెస్‌ల‌ను సాధించ‌డంతో దిశా ఈ రికార్డ్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. గ‌త ఏడాది 9వ ర్యాంక్ సాధించిన దిశా ప‌టానీ ఈ ఏడాది టాప్ ర్యాంకుకి చేరుకోవ‌డం విశేషం.
 
ఇదే జాబితాలో రెండో స్థానంలో సుమన్ రావ్, మూడో స్థానంలో కత్రినా కైఫ్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దీపికా పదుకునె, వర్తికా సింగ్, కైరా అద్వానీ, శ్రద్ధా కపూర్,  యామీ గౌతమ్, అదితీ రావు హైదరీ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్  ఉన్నారు. దక్షిణ భారత హీరోయిన్లకు ఇందులో చోటు లభించలేదు.
 
కాగా, ఇటీవలే టైమ్స్‌ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా విడుదల చేయగా అందులో షాహిద్ కపూర్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో రణవీర్ సింగ్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు.
 
అయితే గ‌త ఏడాది టాప్ ప్లేస్ ద‌క్కించుకున్న అలియా ఈ సారి నెపోటిజం వ‌ల‌న 12 వ స్థానంకు పడిపోయింది. కాగా. మోస్ట్ డిజైరబుల్ మెన్  జాబితాలో నెం.1 గా షాహిద్ కపూర్ నెం.2 రణవీర్ సింగ్ నెం.3 స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments