Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజైరబుల్ ఉమెన్ జాబితాలో అగ్రస్థానంలో 'లోఫర్' బ్యూటీ

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (11:59 IST)
ప్రముఖ పత్రిక టైమ్స్ తాజాగా టాప్ - 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో దిశా పటానీ అగ్రస్థానంలో నిలిచింది. గ‌త ఏడాది ఈ భామ ఇదే జాబితాలో 9వ ర్యాంక్‌లో ఉండగా, ఈ సారి ఏకంగా మొదటి స్థానానికి చేరడం విశేషం.
 
ఈ 'లోఫర్' బ్యూటీ తొలి స్థానాన్ని దక్కించుకోవడానికి కారణం లేకపోలేదు. ఇటీవ‌ల బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేయ‌డం, మంచి స‌క్సెస్‌ల‌ను సాధించ‌డంతో దిశా ఈ రికార్డ్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. గ‌త ఏడాది 9వ ర్యాంక్ సాధించిన దిశా ప‌టానీ ఈ ఏడాది టాప్ ర్యాంకుకి చేరుకోవ‌డం విశేషం.
 
ఇదే జాబితాలో రెండో స్థానంలో సుమన్ రావ్, మూడో స్థానంలో కత్రినా కైఫ్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దీపికా పదుకునె, వర్తికా సింగ్, కైరా అద్వానీ, శ్రద్ధా కపూర్,  యామీ గౌతమ్, అదితీ రావు హైదరీ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్  ఉన్నారు. దక్షిణ భారత హీరోయిన్లకు ఇందులో చోటు లభించలేదు.
 
కాగా, ఇటీవలే టైమ్స్‌ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా విడుదల చేయగా అందులో షాహిద్ కపూర్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో రణవీర్ సింగ్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు.
 
అయితే గ‌త ఏడాది టాప్ ప్లేస్ ద‌క్కించుకున్న అలియా ఈ సారి నెపోటిజం వ‌ల‌న 12 వ స్థానంకు పడిపోయింది. కాగా. మోస్ట్ డిజైరబుల్ మెన్  జాబితాలో నెం.1 గా షాహిద్ కపూర్ నెం.2 రణవీర్ సింగ్ నెం.3 స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments