Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా రేటు రూ.2 కోట్లు? ఎవరు ముందొస్తే వారికే ఫస్ట్ ఛాన్సంటున్న జిగేల్ రాణి

నా రేటు రూ.2 కోట్లు? ఎవరు ముందొస్తే వారికే ఫస్ట్ ఛాన్సంటున్న జిగేల్ రాణి
, బుధవారం, 29 జులై 2020 (14:34 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ ముహూర్తాన పాదం మోపిందోగానీ పూజా హెగ్డే దశ తిరిగిపోయింది. ఒక వైపు హీరోయిన్ పాత్రలతో పాటు... మరోవైపు ఐటమ్ సాంగులతో రెచ్చిపోతోంది. స్పష్టంగా చెప్పాలంటే... ఆమె ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే రాంచరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన "రంగస్థలం" చిత్రంలోని ఐటమ్ సాంగ్ మరో ఎత్తు. ఈ పాటలో పూజా హెగ్డే ఇరగదీసింది. 
 
ఆ తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రిన్స్ మహేష్ బాబుతో 'మహర్షి', తాజాగా అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో' చిత్రాలు చేసింది. ఈ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ మూవీలు. దీంతో ఈ అమ్మడు ఫేట్ మారిపోయింది. ముఖ్యంగా తన పారితోషికాన్ని ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది. ఈ అమ్మడు రెమ్యునరేషన్‌ను భారీ చిత్రాల నిర్మాతలు మాత్రమే భరించే స్థితిలో వున్నారు. 
 
పైగా, పూజాకు తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ ఉండడంతో ఆమె డేట్స్ దొరకడం గగనంగా మారిపోయింది. ఆ మధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రానికి ముందు పూజ కోటి రూపాయల వరకుతీసుకునేది. ఆ సినిమాకు రూ.1.4 కోట్ల వరకు తీసుకుందని వినికిడి. 
 
ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తన పారితోషికాన్ని ఒక్కసారిగా రెండు కోట్లకు పెంచేసిందట. ఈ రేటు విషయంలో నో కాంప్రమైజ్ అంటోంది. అయినప్పటికీ, ఆమెకున్న క్రేజ్‌ను బట్టి పూజను బుక్ చేయడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు మరి! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్ ప్రియురాలు రియాకు బిగుస్తున్న ఉచ్చు - రూ.15 కోట్లు ఏమయ్యాయి?