Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వచ్చినా మారరా..? ఆవులకు అరటిపండులో విషం పెట్టి చంపేశారు..!

కరోనా వచ్చినా మారరా..? ఆవులకు అరటిపండులో విషం పెట్టి చంపేశారు..!
, సోమవారం, 20 జులై 2020 (13:30 IST)
కరోనా లాంటి వ్యాధులు వస్తున్నా మానవ వేషంలో వున్న మృగాలు అకృత్యాలకు పాల్పడుతూనే వున్నారు. మొన్నటికి మొన్న ఏనుగుకు పటాస్‌లతో చంపేసిన ఘటన మరవకముందే.. నేడు ఆవులకు విషం పెట్టి చంపేశారు. అదీ అరటి పండ్లలో విషం పెట్టి.. గోవులను హతమార్చారు. ఇలాంటి ఘటనలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం కరువైనట్టు కనిపిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో కాఫీ తోటలోకి ఆవులు చొరబడుతున్నాయన్న కారణంతో 20 ఆవులకు విషం పెట్టారు. దాంతో ఆవులు అక్కడే మృతి చెందాయి. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్‌లో జరిగిన ఈ దారుణంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్టేట్ సమీప గ్రామాల్లోని ఆవులు మేత మేస్తూ ఎస్టేట్ వరకు వచ్చేవి. దాంతో కాఫీతోటలో దూరి ఆకులను తింటాయని మేనేజర్, సిబ్బంది ఆవులకు అరటిపళ్ళలో విషం పెట్టి తినిపించేవారు. 
 
మృతిచెందిన తర్వాత ఆవుల మృతదేహాలను ఎస్టేట్‌లోనే పెద్ద గొయ్యి తవ్వి ఆవులను అందులో పూడ్చి పెడుతూ వచ్చారు. ఆలా ఇప్పటివరకు మొత్తం 20 ఆవులను చంపి పూడ్చిపెట్టారు. ఆవులు మాయమౌతుండటంతో గ్రామస్థులు ఎస్టేట్ వద్ద గాలిస్తుండగా కళేబరాలు కనిపించాయి. దాంతో విషయం బయట పడింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు సినీ పరిశ్రమ: కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్టుల కలలు.. కన్నీళ్లు