Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ బంధానికి ఫుల్‌స్టాఫ్ పెట్టనున్న దియామిర్జా

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (19:57 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో జంట తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాఫ్ పెట్టనుంది. ఆ జంట ఎవరో కాదు దియా మిర్జా, సాహిల్ సంఘా. వీరిద్దరూ త్వరలోనే విడిపోనున్నారు. ఈ విషయాన్ని దియా మిర్జా స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బాలీవుడ్ హీరోయిన్ అయిన దియా మిర్జా గత 2014లో ప్రముఖ వ్యాపారవేత్త సాహిల్ సంఘాను పెళ్లి చేసుకుంది. అయితే, వీరి వైవాహిక బంధం ఐదేళ్లు పూర్తికాకముందే విడిపోవాలని నిర్ణయించుకోవడం గమనార్హం. 
 
ఇదే అంశంపై దియా మిర్జా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. "మేమిద్దరం గత పదకొండేళ్లుగా కలిసున్నాం. ఒకరి కష్టసుఖాలను మరొకరం పంచుకున్నాం. ఇప్పుడు విడిపోయాలని నిర్ణయించుకున్నాం. మా ప్రయాణాలు విభిన్న మార్గాలను ఎంచుకున్నాయి. విడిపోయినా మేం ఎప్పటిలా స్నేహితులుగానే ఉంటాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీడియాకు ధన్యవాదాలు. ఈ సమయంలో మాకు కాస్త ప్రైవసీని కల్పిస్తారని శిస్తున్నాం. ఇక, ఈ విషయం గురించి నేను ఎలాంటి కామెంట్లు చేయదలచుకోలేదు. ధన్యవాదాలు" అంటూ దియా మిర్జా తన ట్వీట్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments