Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ధృవ నక్షత్రం'తో ఆ దర్శకుడు కుస్తీలు... ఎప్పుడు పొడుస్తుందో?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (16:16 IST)
గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తొలి చిత్రాన్ని ప్లాన్ చేసి, దానికి 'ధృవ నక్షత్రం' అని టైటిల్ పెట్టారు. దాదాపు రెండేళ్ల క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమాకు అప్పట్లోనే ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల చేసారు. సాధారణంగా గౌతమ్ మీనన్ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి, అదీ కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మొదటి సినిమా కావడంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. 
 
కానీ ఈ చిత్రం షూటింగ్ మొదలై ఇప్పటికే రెండేళ్లు దాటిపోతోంది, ఈ వ్యవధిలో విక్రమ్ హీరోగా నటించిన రెండు సినిమాలు కూడా విడుదలయ్యాయి. మొదట్లో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎందుకో అనుకున్నంత వేగంగా విడుదల కాలేదు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు సినీవర్గాల సమాచారం.
 
ఇప్పుడు విక్రమ్, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా కమల్‌హాసన్‌ నిర్మిస్తున్న 'కడారం కొండాన్‌' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'ధృవనక్షత్రం' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని గౌతమ్‌మీనన్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 'కడారం కొండాన్‌' పూర్తయిన వెంటనే 'ధృవనక్షత్రం' షూటింగ్‌‌ను పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మ నటిస్తున్నారు. రానున్న సంవత్సరంలో అయినా ఈ సినిమాకు మోక్షం కలుగుతుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

South Africa: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన దక్షిణాఫ్రికా.. శాంతించండి..

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments