Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ధృవ నక్షత్రం'తో ఆ దర్శకుడు కుస్తీలు... ఎప్పుడు పొడుస్తుందో?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (16:16 IST)
గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తొలి చిత్రాన్ని ప్లాన్ చేసి, దానికి 'ధృవ నక్షత్రం' అని టైటిల్ పెట్టారు. దాదాపు రెండేళ్ల క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమాకు అప్పట్లోనే ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల చేసారు. సాధారణంగా గౌతమ్ మీనన్ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి, అదీ కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మొదటి సినిమా కావడంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. 
 
కానీ ఈ చిత్రం షూటింగ్ మొదలై ఇప్పటికే రెండేళ్లు దాటిపోతోంది, ఈ వ్యవధిలో విక్రమ్ హీరోగా నటించిన రెండు సినిమాలు కూడా విడుదలయ్యాయి. మొదట్లో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎందుకో అనుకున్నంత వేగంగా విడుదల కాలేదు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు సినీవర్గాల సమాచారం.
 
ఇప్పుడు విక్రమ్, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా కమల్‌హాసన్‌ నిర్మిస్తున్న 'కడారం కొండాన్‌' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'ధృవనక్షత్రం' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని గౌతమ్‌మీనన్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 'కడారం కొండాన్‌' పూర్తయిన వెంటనే 'ధృవనక్షత్రం' షూటింగ్‌‌ను పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మ నటిస్తున్నారు. రానున్న సంవత్సరంలో అయినా ఈ సినిమాకు మోక్షం కలుగుతుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments