బాలీవుడ్‌లో విషాదం.. 'ధూమ్' ఫేమ్ సంజయ్ గాధ్వి కన్నుమూత

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (16:40 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ దర్శకుడు "ధూమ్" ఫేమ్ సంజయ్ గాధ్వి మృతి చెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్టు గాధ్వి కుమార్తె వెల్లడించారు. మరో మూడు రోజుల్లో గాద్వి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాల్సివుంది. ఇంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. 
 
ఆదవారం ఉదయం 9.30 గంటలకు గాధ్వి కన్నుమూశారని కుమార్తె సంజీనా వెల్లడించారు. అయితే, ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవనీ, బహుశా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచివుంటారని అభిప్రాయపడ్డారు. 
 
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ధూమ్', 'ధూమ్-2' వంటి చిత్రాలకు గాధ్వి దర్శకత్వం వహించారు. గాధ్వి వయసు 56 సంవత్సరాలు. ఆయన 2000లో "తేరే లియే' చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 2002లో "మేరే యార్ కి షాదీ హై' చిత్రంలో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కేరీర్‌లో చివరగా 'ఆపరేషన్ పరిందే' చిత్రానికి దర్శక్తవం వహించగా, ఇది గత 2020లో విడుదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments