ఔను.. వాళ్లిద్దరూ ఇంకా విడాకులు తీసుకోలేదు... కస్తూరి రాజా

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (17:41 IST)
కోలీవుడ్ స్టార్ ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు తీసుకోబోతున్నట్టు ఈ దంపతులిద్దరూ వేర్వేరుగా ప్రకటించారు. కానీ, ధనుష్ తండ్రి, తమిళ సినీ దర్శకుడు కస్తూరి రాజా మాత్రం మరోలా స్పందించారు. ధనుష్, ఐశ్వర్య దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని చెప్పారు. 
 
కేవలం వారిద్దరి మధ్య ఏర్పడిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా తీవ్రమైన మానసికవేదనతో వారిద్దరూ అలాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. పైగా, వారిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నారని, వారితో చెన్నైకు తిరిగి వచ్చిన తర్వాత వారిరద్దరినీ ఒక చోట చేర్చి మాట్లాడుతామన్నారు.  
 
"అన్ని కుటుంబాల్లో ఉన్నట్టుగానే ధనుష్, ఐశ్వర్య మధ్య కూడా చిన్నపాటి కలహాలు ఉన్నాయి. అవి ముగిసేవి కావు. నేను ఇద్దరితోనూ ఫోన్లో మాట్లాడాను. కొన్ని సలహాలు కూడా ఇచ్చాను" అని చెప్పారు. "వీరిద్దరిని సమాధానపరిచి తిరిగి ఒక్కటి చేసేందుకు తనతో పాటు తమ కుటుంబ సభ్యులు, రజనీకాంత్ తరపు బంధువులు ప్రయత్నిస్తున్నామని" చెప్పారు. 
 
కాగా, 18 యేళ్ళ వివాహం బంధం తర్వాత ఎవరివారు తమ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నామని ధనుష్ ప్రకటించడం, ఆ తర్వాత ఐశ్వర్య కూడా ఇదే విషయాన్ని తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించడం జరిగింది. గత 2004లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న వీరిద్దరికీ యాత్రా, లింగా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments