Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విడిపోయిన ఐశ్వర్య - ధనుష్ దంపతులు

విడిపోయిన ఐశ్వర్య - ధనుష్ దంపతులు
, మంగళవారం, 18 జనవరి 2022 (08:21 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, సినీ హీరో, ఆమె భర్త ధనుష్  దంపతులు విడిపోయారు. వారిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో తమతమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు. తమ విడాకుల విషయాన్ని తొలుత హీరో ధనుష్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఐశ్వర్య తన ఇన్‌స్టా ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. దీంతో వారి 18 యేళ్ల వైవాహిక బంధానికి తెరపడింది. 
 
"18 యేళ్లుగా స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం ఇలా సాగింది ప్రయాణం. ఈ రోజున ఇరువురివి భిన్న మార్గాలుగా కనిపిస్తున్నాయి. ధనుష్ నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్ కోసం మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను ్ధికమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో..." అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, వీరిద్దరి వివాహం గత 2004లో జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా యాత్రా, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతేకాకుండా, వీరిద్దరూ కలిసి పోయస్ గార్డెన్‌లో సొంతంగా కూడా ఓ ఇంటి నిర్మాణానికి కూడా గతంలో శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. కాగా, గత యేడాది టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరొందిన అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోయిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు భార్యాబిడ్డలున్నారు.. నన్ను చంపేయడం ఖాయం... ఎవరు?