Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Dhadaktrailerlaunch కన్నీళ్లు పెట్టుకున్న ఖుషీ.. ఓదార్చిన జాన్వీ కపూర్..

అతిలోక సుందరి శ్రీదేవి మృతి ఆమె కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. ఫ్యాన్స్‌కు శ్రీదేవి మృతి షాకిచ్చింది. దుబాయ్‌లో ఆమె మరణించడాన్ని ఆమె కుమార్తె జాన్వి, ఖుషీ కపూర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (17:14 IST)
అతిలోక సుందరి శ్రీదేవి మృతి ఆమె కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. ఫ్యాన్స్‌కు శ్రీదేవి మృతి షాకిచ్చింది. దుబాయ్‌లో ఆమె మరణించడాన్ని ఆమె కుమార్తె జాన్వి, ఖుషీ కపూర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మ మూవీస్ బ్యానర్‌పై శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ఇషాన్ హీరోగా రూపొందుతోన్న 'ధడక్' సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. 
 
ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి అనిల్‌ కపూర్‌, బోనీకపూర్‌లతో పాటు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో శ్రీదేవిని తలుచుకుని కపూర్‌ కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు. 
 
జాన్వీని బాలీవుడ్‌కు పరిచయం చేసిన శ్రీదేవి ఆమె మొదటి సినిమా చూడకుండానే కన్నుమూయడంపై ఖుషీ కపూర్‌.. తల్లిని తలుచుకుని కన్నీరు పెట్టుకుంది. దీంతో తన చెల్లిని జాన్వీ కపూర్‌ ఓదార్చింది. కాగా మరాఠీ సినిమా ''సైరత్''కు రీమేక్‌గా ''దడఖ్'' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంతి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments