Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడవని కరోనా జ్వరం.. ఐశ్వర్య - ఆరాధ్య ఆస్పత్రికి తరలింపు

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (22:35 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటూ వచ్చారు. అయితే, ఆమెకు జ్వరం ఏమాత్రం తగ్గడం లేదు. అలాగే, దగ్గు, జలుబు ఏమాత్రం ఉపశమనం ఇవ్వలేదు. దీంతో ఐశ్వర్యా రాయ్‌ను ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్ వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఆ చిన్నారిని కూడా నానావతి ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, ఇటీవల బాలీవుడ్ స్టార్ అమితాబ్‌తో పాటు.. ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో వారిని ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత బిగ్ బి కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
ఇందులో ఐశ్వర్యా రాయ్, ఈమె కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్ అని తేలగా, అమితాబ్ సతీమణి జయా బచ్చన్‌కు మాత్రం నెగెటివ్ అని వచ్చింది. అయినప్పటికీ వీరంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. అలాగే, అమితాబ్ కుటుంబ సభ్యులు నివసించే జల్సా నివాసాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ముంబై మున్సిపల్ అధికారులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments