Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపద్బాంధవుడికీ అభినందనల వెల్లువ.. (video)

Megastar Chiranjeevi
Webdunia
శనివారం, 29 మే 2021 (12:19 IST)
Chiranjeevi yuvata
నేను సైతం ప్ర‌పంచాగ్నికి స‌మిధ నొక్క‌టి ఆహుతి ఇచ్చాను..అనే శ్రీ‌శ్రీ‌గారి పాట‌తో కూడిన చిన్న వీడియో బైట్‌ను అఖిల భారత చిరంజీవి యువత విడుద‌ల చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లే ఆక్సిజ‌న్ సిలెండ‌ర్ల‌ను, క్యూరెట్ల‌రు ఆంధ్ర ప్రాంతంలోనూ, ఇత‌ర చోట్ల పంపిణీ చేసిన సంద‌ర్భంగా వారు ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.
 
వాయు పుత్రుడు హనుమంతుని అంశతో "చిరంజీవి" గా తన ప్రస్థానం ప్రారంభించిన మెగాస్టార్ ఇప్పుడు ప్రాణార్తులకు సంజీవని వంటి "ఆక్సిజెన్" అందిస్తూ సార్ధక నామధేయుడయ్యారు. ప్రాణాంతక కరోనా సోకి ఊపిరి ఆగిపోతున్న బాధితులను చూసి చలించిపోయిన చిరంజీవి వెంటనే రంగంలోకి దిగి జిల్లాకో ఆక్సిజెన్ బ్యాంకును ఏర్పాటు చేసి ప్రాణవాయువు అందించే కార్యాచరణ ప్రారంభించారు. 
 
ఆక్సిజెన్ అందక అవస్థలు పడుతున్న కరోనా బాధితులకు నిజంగా ఇది వరంగా మారింది. చిరంజీవి ప్రాణవాయువు అందించి తమనీ చిరంజీవులను చేసారని కరోనా బాధితులు కృతఙ్ఞతలు తెలియజేస్తుండగా పలువురు ముక్తకంఠంతో చిరంజీవి ఆక్సిజెన్ బ్యాంకును అభినందిస్తున్నారు.

ఇకపోతే.. కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల నిర్మాణం వంటి మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా అలాగే తెలంగాణాలోని మరికొన్ని జిల్లాలకు ఆయన ఆక్సిజన్ సిలిండర్లు పంపారు. 
 
తాజాగా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు. అలాగే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ మిషన్‌లో భాగమైన అందరికి, ప్రాణాలను కాపాడటానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments