'కలర్స్' స్వాతి కాదు.. ఇకపై శ్రీమతి స్వాతి... 2న రిసెప్షన్....

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి 'కలర్స్' స్వాతి. బుల్లితెరకు 'కలర్స్' అనే కార్యక్రమం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన యువతి కలర్స్ స్వాతి

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (10:56 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి 'కలర్స్' స్వాతి. బుల్లితెరకు 'కలర్స్' అనే కార్యక్రమం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన యువతి కలర్స్ స్వాతి. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, పిమ్మట హీరోయిన్‌గా మారింది. ఇపుడు శ్రీమతిగా మారింది.
 
మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. వీరిద్దరూ కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకారం తెలపడంతో ఈ జంట ఒక్కటయ్యింది. ఈ పెళ్లి ఎలాంటి అనవసర హంగామా లేకుండా ఎంతో సింపుల్‌గా జరిగింది. 
 
అంతేకాదు ఈ వివాహమహోత్సవాన్ని పూర్తిగా ప్రైవేటు వేడుకగా నిర్వహించారు. టాలీవుడ్ - కోలీవుడ్ నుంచి పెద్దగా సెలబ్రెటీల్ని ఆహ్వానించలేదని తెలుస్తోంది. కేవలం స్వాతి సన్నిహితులు - ఇరు కుటుంబ సభ్యులు, వారి తరపున బంధువులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. సెప్టెంబర్‌ 2న వివాహ విందు ఇవ్వనుంది. 
 
కాగా, కలర్స్ స్వాతి పలు చిత్రాల్లో నటించింది కూడా. ముఖ్యంగా, 'అష్టాచెమ్మా', 'స్వామిరారా', 'కార్తికేయ' వంటి చిత్రాల్లో నటించి మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా, ఈ అమ్మడుపై పలు రకాల ప్రేమ ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా సినీ ఇండస్ట్రీలో కొనసాగిన కలర్స్ స్వాతి ఇపుడు ఓ ఇంటికి కోడలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments