Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంకర్ బాబూ... ఆర్టీసీ క్రాస్ రోడ్డు థియేటర్‌లో 'సైరా' చూస్తారా?

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (17:53 IST)
శంకరా... ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ థియేటర్‌లో సాధారణ ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలని వుందని మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కోరారట. ఆమె పుత్రుడు శివశంకర ప్రసాద్ సైతం సమ్మతించారట. ఇంతకీ శంకరా అంటే.. ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. 
 
అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. సైరా గెటప్‌లో ఉన్న తనను చూసి తన తల్లి అంజనాదేవి ఎంతో సంతోషపడిందన్నారు. శంకర్ బాబూ, నిన్ను చూస్తుంటే ఎవరో మహానుభావుడ్ని చూసినట్టుందిరా అంటూ ముగ్ధురాలైందని చిరు వివరించారు.
 
పైగా, హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మామూలు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకుల మధ్యన కూర్చుని సైరా సినిమా చూస్తానని చెప్పిందని వెల్లడించారు. తామందరం మల్టీప్లెక్స్‌లో సైరా చూద్దామన్నా తన తల్లి ససేమిరా అంటోందని, అభిమానుల కోలాహలం మధ్యనే సినిమా చూడాలని కోరుకుంటోందని తెలిపారు. 
 
ఆ తర్వాత సైరా నరిసింహా రెడ్డి కథపై చెలరేగిన వివాదం, ఉయ్యాలవాడ వంశీయుల ఆందోళన తదితర అంశాలపై చిరంజీవి స్పందిస్తూ, వాస్తవానికి వాళ్లు చాలా అమాయకులని, ఎవరో వాళ్లను తమపై ఉసిగొల్పారని చిరంజీవి ఆరోపించారు. వాళ్లది సాధారణ ఆర్థిక స్థితి అని, వాళ్లు సులభంగా ఉచ్చులో పడిపోయారని విచారం వ్యక్తం చేశారు.
 
వారికి కానీ, వాళ్ల గ్రామానికి కానీ ఏదైనా మేలు చేద్దామని రాంచరణ్ భావించాడని, కానీ వాళ్లు 'మేం పాతిక కుటుంబాలు ఉన్నాం, కుటుంబానికి రెండు కోట్లు ఇవ్వాలి' అని డిమాండ్ చేశారని చిరంజీవి వెల్లడించారు. ఆ విధంగా అయితే రూ.50 కోట్లు తాము ఎక్కడి నుంచి తెచ్చివ్వగలమని ఆవేదన వ్యక్తం చేశారు. 100 సంవత్సరాల తర్వాత ఎవరి కథ అయినా చరిత్ర కిందికే వస్తుందని, దానిపై వారసులకు హక్కులు ఉండవని, ఈ విషయం కోర్టు కూడా చెప్పిందని చిరంజీవి గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments