Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 'ఆచార్య' రిలీజ్ ఎపుడో చెప్పేశారు!

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (15:07 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇపుడు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఈ నెల 9వ తేదీ నుంచి చిత్రం షూటింగ్ తిరిగి మొదలవుతుందని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్ మీడియాలో బుధవారం అధికారికంగా ప్రకటించింది.
 
లాక్డౌన్ అనంతరం, పక్కాగా రక్షణ చర్యలు తీసుకుని, ఈ నెల 9 నుంచి తిరిగి షూటింగును నిర్వహించడానికి ఉత్తేజభరితంగా ఉన్నామని సదరు సంస్థ తెలిపింది. ఇది నెల రోజుల భారీ షెడ్యూలనీ, ఇందులో చాలా భాగం చిత్రీకరణ పూర్తవుతుందన్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లో సందడి చేస్తుందని విడుదల విషయాన్ని కూడా ప్రకటించారు.
 
కాగా, సామాజిక ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చిత్ర నిర్మాత, హీరో అయన రాం చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. గతంలో చిరంజీవికి పలు సినిమాలలో హిట్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. రాం చరణ్, నిరంజన్ రెడ్డి కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments