Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

'అన్నయ్య'తో మిస్.. 'తమ్ముడు'తో ఛాన్స్ ... : పవర్ స్టార్‌తో 'ఫిదా' భామ!! (video)

Advertiesment
Pawan Kalyan
, గురువారం, 29 అక్టోబరు 2020 (09:39 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "వకీల్ సాబ్". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇది పూర్తయిన తర్వాత పవన్ మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియమ్" అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో పవన్ పక్కన కథానాయిక పాత్రకు సాయిపల్లవి పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతుందనేది త్వరలో వెల్లడవుతుంది.
 
ఇదిలావుంచితే, ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా 'లవ్ స్టోరీ' చిత్రంలోనూ, 'విరాటపర్వం' చిత్రంలో రానా సరసన, 'శ్యామ్ సింగ రాయ్'లో నాని పక్కన ప్రస్తుతం సాయిపల్లవి నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా, మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో కూడా చెల్లి పాత్రను చేయనుందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, ఆ ఛాన్స్‌ను సాయి పల్లవి కోల్పోగా, మలయాళ భామ కీర్తి సురేష్ కొట్టేసింది. అయితే పవర్ స్టార్ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను సాయి పల్లవి కొట్టేసింది. 
 
నిజానికి సాయిపల్లవి ఇమేజ్ వేరు. మిగతా హీరోయిన్లకు ఆమెకు ఏమాత్రం పోలిక ఉండదు. గ్లామరస్ పాత్రలు అస్సలు చేయదు. ప్రాధాన్యత వున్న పాత్రలే తన హోమ్లీ లుక్‌తో చేస్తుంటుంది. అందుకే, ఈ ముద్దుగుమ్మకు ఇంతవరకు స్టార్స్‌తో నటించే ఛాన్స్ రాలేదు. అలాంటి సాయిపల్లవి ఇపుడు పవన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకోవడం గమనార్హం. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పునర్నవి వేలికి రింగు పెట్టిన వ్యక్తి ఎవరబ్బా?