Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌ను పగబట్టిన జావేద్ అక్తర్!

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (14:17 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌కు బాలీవుడ్ సీనియర్ గేయరచయిత జావేద్ అక్తర్ తేరుకోలేని షాకిచ్చారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు పగటిపూటే చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జావేద్ అక్తర్ ఆమెపై పరువు నష్టందావా వేశారు. 
 
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వ్యవహారంలో తనను ఇరికిస్తూ కంగన తనపై నిరాధార ఆరోపణలు చేసిందని ఆరోపించిన జావేద్... అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పైగా ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కోరారు.
 
కాగా, హీరో హృతిక్ రోషన్ కుటుంబంతో కుమ్మక్కై జావేద్ అక్తర్ తనను ఇంటికి పిలిచి బెదిరించారని, హృతిక్ కుటుంబానికి క్షమాపణ చెప్పకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారని కొద్ది రోజుల క్రితం కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
 
సినీ పరిశ్రమలో రాకేష్ రోషన్ పెద్ద మనిషని, అతనితో పెట్టుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని జావేద్ హెచ్చరించినట్టు కంగనా తెలిపింది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కంగనపై జావేద్ తాజాగా కోర్టుకెక్కారు. దీనిపై విచారణను డిసెంబరు మూడో తేదీకి కోర్టు వాయిదావేసింది. 
 
ఇదిలా ఉండగా, ముంబైలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై కంగన, ఆమె సోదరి రంగోలికి ముంబైలోని బాంద్రా పోలీసులు సమన్లు జారీచేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. మొత్తంమీద... కంగనా రనౌత్‌తో అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు ముంబై పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments