Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటుడు బాలాజీపై కిడ్నీ మోసం కేసు.. సీన్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి

సినీ నటుడు బాలాజీపీ కిడ్నీ మోసం కేసు నమోదైంది. దీంతో బాధితురాలికి అండగా నిలబడేందుకు సినీ నటి శ్రీరెడ్డి ముందుకు వచ్చారు. ఫలితంగా ఇది చర్చనీయాంశంగా మారనుంది.

Webdunia
బుధవారం, 9 మే 2018 (14:19 IST)
సినీ నటుడు బాలాజీపీ కిడ్నీ మోసం కేసు నమోదైంది. దీంతో బాధితురాలికి అండగా నిలబడేందుకు సినీ నటి శ్రీరెడ్డి ముందుకు వచ్చారు. ఫలితంగా ఇది చర్చనీయాంశంగా మారనుంది.
 
ఈ కేసులోని వివరాలను పరిశీలిస్తే, సినీ, బుల్లితెర నటుడు బాలాజీ భార్య కృష్ణవేణికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో బాలాజీ కిడ్నీ దాతకోసం సంప్రదిస్తుండగా డబ్బు అవసరమైన భాగ్యలక్ష్మి అనే ఓ మహిళ తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
 
ఈ ఒప్పందంలో భాగంగా ముందస్తుగా రూ.3 లక్షల నగదును భాగ్యలక్ష్మికి బాలాజీ అందజేశాడు. ఆ తర్వాత ఆమె కిడ్నీ దానం చేయడంతో తన భార్యను బతికించుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బు ఇవ్వాలని బాలాజీని కిడ్నీదాత సంప్రదించగా, ఆమెను బెదిరించసాగాడు. దీంతో బాధిత మహిళ జూబ్లీహిల్స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న నటి శ్రీరెడ్డి బాధితురాలికి బాసటగా నిలిచారు. ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాలాజీ తన దగ్గర ఉన్న ఒప్పంద పత్రాలు, బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను పోలీసులకు సమర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments