Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో ఆఫర్లే ఆఫర్లు.. బిజీ బిజీగా వున్న రష్మిక మందన్న

Webdunia
శనివారం, 9 జులై 2022 (13:59 IST)
కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన రష్మిక.. తెలుగులో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే ఆమె హిందీలో 'గుడ్ బై' అనే సినిమాను పూర్తి చేసింది. ప్రస్తుతం స్పై థ్రిల్లర్ 'మిషన్ మజ్ను' సినిమాలో నటిస్తోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా కనిపించనున్నారు.
 
ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే రష్మికకి బాలీవుడ్‌లో ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో సినిమా సైన్ చేసింది ఈ బ్యూటీ. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్ లో దర్శకుడు శశాంక్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందనాను తీసుకోవాలనుకుంటున్నారు. రష్మికని తీసుకోవడం వలన కథను ఫ్రెష్ నెస్ వస్తుందని భావిస్తున్నారు. 
 
టైగర్ ష్రాఫ్ తోనే కాకుండా రణబీర్ కపూర్‌తో 'యానిమల్' అనే సినిమా చేస్తోంది రష్మిక. దీన్ని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లో కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటుంది రష్మిక. త్వరలోనే అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప2' సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. 
 
ఈ సినిమాతో పాటు విజయ్ నటిస్తోన్న 'వారసుడు'లో రష్మిక హీరోయిన్‌గా కనిపించనుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments