Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20లక్షలు వద్దనుకున్న వరుణ్.. పార్టీ చేసుకున్న రాహుల్.. పునర్నవి..?

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (10:49 IST)
టాలీవుడ్ తారలతో బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్ సందడిగా ముగిసింది. టాప్ ఫైవ్‌లో మొదట అలీ రెజా ఎలిమినేట్‌ కాగా.. ఆ తర్వాత నాగార్జున రూ.10లక్షలు ఆఫర్‌ ఉందని... ఎవరైనా వాటిని తీసుకుని వెళ్లిపోవచ్చని కోరగా ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత మరో రూ.10లక్షలు కలిపి, మొత్తం రూ.20లక్షలు ఆఫర్‌ చేశారు. అయినా కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వరుణ్‌ సందేశ్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. 
 
దీంతో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లో తన ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. తనని ఇన్నిరోజుల పాటు ప్రోత్సహిస్తూ వచ్చిన తన అభిమానులు, ప్రేక్షకుల కోసమే తాను రూ.20లక్షలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు.. 20 లక్షలు అలా తీసుకుని ఉంటే తనపై వారు చూపించిన అభిమానానికి విలువ ఉండదని వరుణ్‌ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్‌ తెలుగు 3 టైటిల్‌ను సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుచుకున్నారు. టైటిల్‌ను గెలిచిన సందర్భంగా రాహుల్, వరుణ్ పార్టీ చేసుకున్నారు. వారిద్దరి ఫోటోలను, వీడియోను పునర్నవి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో రాహుల్, వరుణ్‌లు ఒకరిమీద ఒకరు పడుతూ.. బ్రోమాన్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments