Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఫినాలేకు బడా స్టార్.. అఖిల్ లేదా అభిజీత్‌.. ఎవరు విన్నర్?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (14:00 IST)
బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ చివరి అంకానికి చేరుకుంది. 19మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోని అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. శని, ఆది వారాలలో చాలా స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చే నాగ్‌ హౌజ్‌మేట్స్‌తో కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. తప్పులు చెబుతూ వాటిని సరిదిద్దడం, విభేదాలతో విడిపోయిన వారిని కలపడం, నాలుగు గోడల మధ్య ఉన్న వీరికి వినోదం అందించడం చేస్తున్నారు. సందడిగా సాగుతూ వస్తున్న బిగ్ బాస్4 ఫినాలే డిసెంబర్ 30న భారీ లెవల్‌లో ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే నిర్వాహకులు అందుకు సంబంధించి ప్లాన్ చేస్తుండగా,ఈ ఫినాలేకు బడా స్టార్‌నే గెస్ట్‌గా తీసుకురానున్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరై తన చేతుల మీదుగా రాహుల్ సిప్లిగంజ్‌కు ట్రోఫీ అందించారు. కాగా, ప్రస్తుతం హౌజ్‌లో ఎనిమిది మంది సభ్యులు ఉండగా, వారిలో అఖిల్ లేదా అభిజీత్‌లలో ఒకరు విన్నర్‌గా నిలుస్తారనే టాక్స్ వినిపిస్తున్నాయి.
 
ప్రస్తుతం షోలో అఖిల్ సర్తక్, అభిజీత్, సోహెల్, అరియానా, అవినాష్, లాస్యా, మోనాల్ గజ్జర్, హరికా ఉన్నారు. వాటిలో ఒకటి ఈ వారాంతంలో ఎలిమినేట్ అవుతుంది. మన చుట్టూ ఉన్న కరోనా భయాన్ని పరిగణనలోకి తీసుకుని షో నిర్వాహకులు ఈసారి టీవీ షో కోసం అతిథులను ఆహ్వానించకపోవచ్చుననే టాక్ కూడా వస్తోంది. ఇక ఎనిమిది మంది కంటిస్టెంట్స్‌లో ఐదుగురు ఫైనల్స్‌కు వెళ్లే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments