Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ సాయిపల్లవికి షాకిచ్చిన హైకోర్టు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (08:18 IST)
టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారించారు. దీన్ని గురువారం హైకోర్టు కొట్టివేసింది. 
 
దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం "విరాటపర్వం". ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపిన ఘటనలను, ఇటీవల గోవులను తరలిస్తున్న డ్రైవర్ చంపిన ఘటనలను సాయిపల్లవి పోల్చుతూ మాట్లాడారు. 
 
ఈ వ్యాఖ్యలపై బజరంగ్‌దళ్, వీహచ్‌పీ సభ్యుడు అఖిల్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్‌ 21న పోలీసులు నోటీసులు జారీ చేయగా వీటిని సవాలు చేస్తూ సాయిపల్లవి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్‌ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. 
 
పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కాశ్మీర్‌ ఉగ్రవాదులతో గోసంరక్షులను పోల్చారంటూ ఫిర్యాదు ఇవ్వడం సరికాదని, మానవత్వంతో ఉండాలని మాత్రమే సాయిపల్లవి చెప్పారని అన్నారు. 
 
ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, కేవలం వాస్తవాలను ధ్రువీకరించుకోవడానికే నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది టి.శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments