Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా స్థానంలో భూమి పడ్నేకర్

బాలీవుడు నటి ప్రియాంకా స్థానంలో మరో నటి భూమి పడ్నేకర్‌ను ఎంపికైంది. వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా షారూక్ ఖాన్ నటిస్తున్నారు. మహేశ్ మతై దర్శకత్వం వహిస్తున్

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (16:53 IST)
బాలీవుడు నటి ప్రియాంకా స్థానంలో మరో నటి భూమి పడ్నేకర్‌ను ఎంపికైంది. వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా షారూక్ ఖాన్ నటిస్తున్నారు. మహేశ్ మతై దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంకా చోప్రాను హీరోయిన్‌గా ఎంచుకోవాలని తొలుత భావించారు. కానీ ఆమె నిరాకరించడంతో ఆమె స్థానంలో భూమి పడ్నేకర్‌ను ఎంచుకున్నారు.
 
వాస్తవానికి ప్రియాంకా చోప్రా పలు హాలీవుడ్ చిత్రాలతోపాటు టీవీ సిరీస్‌లో బిజీగా ఉంది. పైగా అమెరికా సింగర్ నిక్ జోనస్‌తో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. వీరిద్దరికి వచ్చే నవంబరు నెలలో వివాహం జరుగనుంది. 
 
అయితే, బాలీవుడ్‌లో ఆమెకు రెండు చిత్రాల్లో ఆఫర్ వచ్చింది. అందులో ఒకటి భారత్ కాగా, మరొకటి సెల్యూట్. అయితే, భారత్ చిత్రం షూటింగ్‌లో పాల్గొని, ఆ తర్వాత అర్థాంతరంగా తప్పుకుంది. ఇక సెల్యూట్ విషయంలోనూ అదే జరిగింది. 
 
ఇదిలావుంటే, షారూక్ ఖాన్ నటించే వ్యోమగామి రాకేశ్‌శర్మ బయోపిక్ చిత్రంలో భూమి పడ్నేకర్‌కు చోటు కల్పించారు. ఈ చిత్రంలో కేవలం రాకేశ్‌శర్మ ప్రొఫెషనల్ లైఫ్‌ని మాత్రమేకాకుండా భార్యతో ఆయనకున్న అటాచ్‌మెంట్‌ను కూడా చర్చించనున్నారట. దాంతో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉండనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments