బుక్ మై షోలో కనిపించని భీమ్లా నాయక్ - ఆందోళనలో పవన్ ఫ్యాన్స్

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (13:20 IST)
ఈ నెల 25వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్" చిత్రం విడుదలకానుంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, దగ్గుబాటి రానా విలన్‌గా నటించారు. ఈ చిత్రం కోసం టిక్కెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, పాపులర్ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో 'భీమ్లా నాయక్' కనిపించడం లేదు. ఇది పవన్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నైజాం ఏరియాలకు చెందిన తెలుగు సినిమా పంపిణీదారులు ప్రముఖ ఆన్‌లైన్ ఎంటర్‌టైన్మెంట్ టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీ బుక్ మై షోని నిషేధించాలని నిర్ణయించాయి. దీంతో నైజా ఏరియాకు సంబంధించిన 'భీమ్లా నాయక్' ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ మై షో యాప్‌కు ఇవ్వలేదు. 
 
దీనికి కారణం.. బుక్ మై షో టిక్కెట్ అధిక ధరకు విక్రయిస్తుంది. దీంతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంది. అదేసమయంలో ఏపీలో టిక్కెట్ల పంచాయతీకి పరిష్కారం లభించేంత వరకు సినిమా టిక్కెట్లను థియేటర్ కౌంటర్లలోనే విక్రయించాలని ఎగ్జిబిటర్లు చిత్రపరిశ్రమను కోరినట్టు సమాచారం. ఈ కారణంగా భీమ్లా నాయక్ టిక్కెట్లను బుక్ మై షో ‌లో అందుబాటులో ఉంచలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments