Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్- మంత్రి కేటీఆర్​‌కు ఆహ్వానం

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్- మంత్రి కేటీఆర్​‌కు ఆహ్వానం
, శనివారం, 19 ఫిబ్రవరి 2022 (16:15 IST)
యూసఫ్​గూడాలోని పోలీస్​ గ్రౌండ్స్​లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 21 సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. 
 
అగ్రహీరో మహేశ్​ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి, నందమూరి నట సింహం బాలకృష్ణ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయనేది ఆ వార్తల సారాంశం. 
 
అయితే ఆ అంచనాలన్నీ తప్పయ్యాయి. అయితే ఈ సారి సినిమా రంగం నుంచి కాకుండా రాజకీయ నాయకుల్లో ఒకరిని భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు గెస్ట్​గా పిలిచింది చిత్ర బృందం. 
 
యూత్​లో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్​ను ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా భీమ్లా నాయక్​ టీమ్​ ఆహ్వానించగా.. ఇందుకు ఆయన కూడా ఓకే చెప్పారు. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్​టైన్మెంట్స్​ అధికారికంగా ప్రకటన కూడా చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీమ్లా నాయక్ గురించి వివ‌రాలు తెలుసుకున్న కె.టి.ఆర్