Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భీమ్లా నాయక్ గురించి వివ‌రాలు తెలుసుకున్న కె.టి.ఆర్

భీమ్లా నాయక్ గురించి వివ‌రాలు తెలుసుకున్న కె.టి.ఆర్
, శనివారం, 19 ఫిబ్రవరి 2022 (16:05 IST)
KTR, Trivikram Srinivas, Radhakrishna
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  
'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
 
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ నెల 21 న 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా నిర్వహించటానికి చిత్ర బృందం సంకల్పించింది. హైదరాబాద్, యూసుఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభ మవుతుంది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కె.టి.ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ను ఆహ్వానించేందుకు శ‌నివారంనాడు కె.టి.ఆర్‌.ను త్రివిక్ర‌మ్‌, నిర్మాత రాధాకృష్ణ వెళ్ళారు. ఆయ‌న సాద‌రంగా ఆహ్వానించి ఏర్పాట్ల గురించి సినిమా గురించి వివ‌రాలు తెలుసుకున్నారు.
 
అలాగే రాష్ట్ర   సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ప్రేక్షకాభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో చిత్ర బృందం అంతా పాల్గొననుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళాతపస్వి రాజేష్ కన్నుమూత..