Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాటి మనిషిని బానిసలాగా చూడాలంటే నీ గుండెలదరాలి' : భైరవగీత ట్రైలర్

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (12:56 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పిస్తున్న తాజా చిత్రం భైరవగీత. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో ఆలోచనను ఆలోచించిన మనిషిని చంపలేకపోతే ఏం చెయ్యాలా? ఆ ఆలోచన ఎవరి గురించో వారిని చంపేస్తే సరిపోద్ది అయ్యా.. అనే డైలాగ్ సినిమా ఎలా ఉండ‌నుందో తెలుపుతుంది. 
 
తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహించకపోయినా.. సిద్ధార్థ్‌కు అన్నివిధాలా సహకరించినట్లు ఈ ట్రైలర్ చూస్తే ఇట్టే తెలిసిపోతోంది. గతంలో ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాలు పెంచిన యూనిట్‌, తాజాగా మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేసి మ‌రింత ఆస‌క్తి క‌న‌బ‌ర‌చేలా చేశారు. 
 
ఈ చిత్రాన్ని యధార్థ ఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ ప్రేమ క‌థ చిత్రంలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. 'మనుషులను బానిసలుగా చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో దింపే కత్తే దీనికి సమాధానం' అంటూ ఫ్యాక్షన్ పెద్దలపై తిరుగుబాటును కూడా ఈ ట్రైలర్లో చూపించారు. 
 
'సాటి మనుషులను బానిసలుగా చూడాలంటే నీ గుండెలు అదరాలి' అంటూ ముగించి సినిమాలపై అంచనాలు పెంచారు. ఈ సినిమా ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments