Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీలంక క్రికెటర్ డిసిల్వ తండ్రి హత్య.. కాల్పులు జరిపి పారిపోయారు..

శ్రీలంక క్రికెటర్ ధనంజయ డిసిల్వ(26) తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో సిల్వ తండ్రి రంజన్ సిల్వ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన శ్రీలంకలో కలకలం ర

శ్రీలంక క్రికెటర్ డిసిల్వ తండ్రి హత్య.. కాల్పులు జరిపి పారిపోయారు..
, శుక్రవారం, 25 మే 2018 (14:38 IST)
శ్రీలంక క్రికెటర్ ధనంజయ డిసిల్వ(26) తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో సిల్వ తండ్రి రంజన్ సిల్వ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన శ్రీలంకలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ధనంజయ డిసిల్వ(26) తండ్రి రంజన్‌ డిసిల్వపై దుండగులు గురువారం అర్థరాత్రి దాడిచేశారు. ఈ క్రమంలో రంజన్‌ డిసిల్వ తప్పించుకునే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 
 
కాల్పులు జరిపిన దుండగులు పరారీలో వున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో రంజన్‌ డిసిల్వ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ధనంజయ్ తండ్రి రంజన్.. స్థానికంగా ఓ రాజకీయ నేత కావడంతో శత్రువులెవరైనా ఈ పని చేసివుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తండ్రి దుర్మరణంతో శుక్రవారం వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనంజయ డిసిల్వ తప్పుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరమ్మాయిలతో రొనాల్డినో పెళ్లి.. సవతి పోరు లేదట.. అందుకే?