Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ దర్శకుడికి షాక్... తీసిన సినిమానంతా పడేసి కొత్తగా రీషూట్

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (11:53 IST)
విజయ్ దేవరకొండకు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమా తెలుగునాట సంచలన విజయం సాధించడంతో అనేక భాషలలో దీనిని రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా డైరెక్టర్ బాలా దర్శకత్వంలో రూపొందుతోంది. దీనికి  'వర్మ' అనే టైటిల్‌‌ను ఖరారు చేసి, కొంత కాలం క్రితం టీజర్‌ను విడుదల చేసారు. 
 
దీనికి అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. తెలుగు సినిమా అయినప్పటికీ చాలామంది తమిళ ప్రేక్షకులు కూడా అర్జున్ రెడ్డి సినిమాను చూసినందున వారిని ధృవ్ ఆకట్టుకోలేకపోయాడని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు తీసిన ఫుటేజీని పడేసి మల్లీ కొత్త టెక్నీషియన్స్‌తో రీ షూట్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. 
 
హీరో తప్ప మిగిలిన అందరినీ మారుస్తున్నట్లు ప్రకటించారు. బాలా డైరెక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ ఔట్‌పుట్‌పై నిర్మాతలు అసంతృప్తిగా ఉండటమే దానికి కారణం. దీని వలన ఖర్చు ఎంతో పెరిగినప్పటికీ తెలుగులో అర్జున్ రెడ్డి స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో దీనిని పూర్తిగా రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. మంచి పేరున్న దర్శకులలో ఒకరైన బాలా దీన్ని ఎలా తీసుకున్నారో మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments