Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ దర్శకుడికి షాక్... తీసిన సినిమానంతా పడేసి కొత్తగా రీషూట్

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (11:53 IST)
విజయ్ దేవరకొండకు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమా తెలుగునాట సంచలన విజయం సాధించడంతో అనేక భాషలలో దీనిని రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా డైరెక్టర్ బాలా దర్శకత్వంలో రూపొందుతోంది. దీనికి  'వర్మ' అనే టైటిల్‌‌ను ఖరారు చేసి, కొంత కాలం క్రితం టీజర్‌ను విడుదల చేసారు. 
 
దీనికి అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. తెలుగు సినిమా అయినప్పటికీ చాలామంది తమిళ ప్రేక్షకులు కూడా అర్జున్ రెడ్డి సినిమాను చూసినందున వారిని ధృవ్ ఆకట్టుకోలేకపోయాడని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు తీసిన ఫుటేజీని పడేసి మల్లీ కొత్త టెక్నీషియన్స్‌తో రీ షూట్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. 
 
హీరో తప్ప మిగిలిన అందరినీ మారుస్తున్నట్లు ప్రకటించారు. బాలా డైరెక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ ఔట్‌పుట్‌పై నిర్మాతలు అసంతృప్తిగా ఉండటమే దానికి కారణం. దీని వలన ఖర్చు ఎంతో పెరిగినప్పటికీ తెలుగులో అర్జున్ రెడ్డి స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో దీనిని పూర్తిగా రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. మంచి పేరున్న దర్శకులలో ఒకరైన బాలా దీన్ని ఎలా తీసుకున్నారో మరి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments