Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ దర్శకుడికి షాక్... తీసిన సినిమానంతా పడేసి కొత్తగా రీషూట్

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (11:53 IST)
విజయ్ దేవరకొండకు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమా తెలుగునాట సంచలన విజయం సాధించడంతో అనేక భాషలలో దీనిని రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా డైరెక్టర్ బాలా దర్శకత్వంలో రూపొందుతోంది. దీనికి  'వర్మ' అనే టైటిల్‌‌ను ఖరారు చేసి, కొంత కాలం క్రితం టీజర్‌ను విడుదల చేసారు. 
 
దీనికి అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. తెలుగు సినిమా అయినప్పటికీ చాలామంది తమిళ ప్రేక్షకులు కూడా అర్జున్ రెడ్డి సినిమాను చూసినందున వారిని ధృవ్ ఆకట్టుకోలేకపోయాడని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు తీసిన ఫుటేజీని పడేసి మల్లీ కొత్త టెక్నీషియన్స్‌తో రీ షూట్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. 
 
హీరో తప్ప మిగిలిన అందరినీ మారుస్తున్నట్లు ప్రకటించారు. బాలా డైరెక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ ఔట్‌పుట్‌పై నిర్మాతలు అసంతృప్తిగా ఉండటమే దానికి కారణం. దీని వలన ఖర్చు ఎంతో పెరిగినప్పటికీ తెలుగులో అర్జున్ రెడ్డి స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో దీనిని పూర్తిగా రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. మంచి పేరున్న దర్శకులలో ఒకరైన బాలా దీన్ని ఎలా తీసుకున్నారో మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో తమ తొమ్మిదవ స్టోర్‌ ప్రారంభంతో కార్యకలాపాలను విస్తరించిన యమ్మీ బీ

మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ గుడ్ న్యూస్, 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితం

టీడీపీ కూటమి సర్కారు చాప్టర్ క్లోజ్... ఈ సారి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే : కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి

పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం
Show comments