Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

ఐవీఆర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (15:03 IST)
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులను ఊచకోత కోస్తున్న ఘటనలను చూసి కూడా కొంతమంది పాకిస్తాన్ దేశానికి మద్దతుగా మాట్లాడటం శోచనీయం. pahalgam terror attack పహెల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ దేశం పైన భారతదేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్ దేశం పీచమణచాలంటూ నినదిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లపై పాకిస్తాన్ జెండాను రోడ్లపై అంటించి కాళ్లతో తొక్కుతూ అక్కడివారు నిరసన చేపట్టారు.
 
ఐతే ఓ మహిళ పాక్ జెండా కాగితాలను రోడ్లపై నుంచి తీసి, వాటిని ఎందుకు అలా తొక్కుతారంటూ ప్రశ్నించింది. దీనిపై స్థానికులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసారు. పాక్ జెండాను కిందపడేసి తొక్కాలంటూ ఆమెను నిలదీశారు. అందుకు ఆమె ససేమిరా అన్నది. దీనితో అలా అంగీకరించకపోతే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని అన్నారు.
 
అయినప్పటికీ ఆ మహిళ ఏమాత్రం పట్టించుకోలేదు. దీనిపై మెగా కోడలు లావణ్య కొణిదెల త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని హతమార్చారు. వీరి దుశ్చర్యలను సమర్థించేవాళ్లు ఇంకా ఇక్కడ వున్నారా... ఐతే ఇక్కడ నుంచి శుద్ధీకరణ ప్రారంభమవ్వాలి. వైరి దేశానికి మద్దతు పలికేవారిని ఏరివేస్తూ ముందుకు సాగాలి అంటూ ఆమె ట్వీట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments