Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు కరోనా లాంటిది: రామ్ గోపాల్ వర్మ సంచలనం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (19:33 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధరల విషయంలో తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సర్కారుపై మండిపడ్డారు. ఎవరికైనా లిమిటేషన్ వుంటుందని చెప్పాడు. ఏపీ సర్కారు కరోనా లాంటిదని సంచలన వ్యాఖ్యలు చేశాడు వర్మ. 
 
కోవిడ్‌ను మనం ఏమీ చేయలేమని.. అలాగే ఏపీ సర్కారును కూడా ఏమీ చేయలేమని తెలిపాడు. ఇక ఆ ఇద్దరు హీరోలను టార్గెట్ చేసేందుకు సినిమా ఇండస్ట్రీ మొత్తం దూం పెడుతున్నారా? లేకుంటే వేరే కారణం ఏమైనా వుందా అనేది తనకు తెలియదని వర్మ వ్యాఖ్యానించాడు.
 
ప్రస్తుతం ఆ ఇద్దరు హీరోలు ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు మొత్తం ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో ప్రస్తుతం ఆర్జీవీ కూడా నిలిచాడు. ప్రస్తుతం సినిమా మేకింగ్‌లో 70 శాతం హీరోలకు రెమ్యునరేషన్‌ పోతుందన్న మంత్రుల వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. మంత్రులు పేర్నినాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశాడు. 
 
ఇక సినిమాకు అయ్యే ఖర్చులో సినిమా హీరోల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది అన్నారు. నిర్మాత ఎవరైనా నష్టాలు వస్తాయనే ఉద్దేశంతో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయరని ఆర్జీవీ గుర్తు చేశారు. హీరోకి అంత డబ్బులు ఇస్తున్నారంటే.. అతడిని చూసిని అభిమానులు వస్తారనే నమ్మకంతోనే అన్నాడు.

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments