Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు కరోనా లాంటిది: రామ్ గోపాల్ వర్మ సంచలనం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (19:33 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధరల విషయంలో తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సర్కారుపై మండిపడ్డారు. ఎవరికైనా లిమిటేషన్ వుంటుందని చెప్పాడు. ఏపీ సర్కారు కరోనా లాంటిదని సంచలన వ్యాఖ్యలు చేశాడు వర్మ. 
 
కోవిడ్‌ను మనం ఏమీ చేయలేమని.. అలాగే ఏపీ సర్కారును కూడా ఏమీ చేయలేమని తెలిపాడు. ఇక ఆ ఇద్దరు హీరోలను టార్గెట్ చేసేందుకు సినిమా ఇండస్ట్రీ మొత్తం దూం పెడుతున్నారా? లేకుంటే వేరే కారణం ఏమైనా వుందా అనేది తనకు తెలియదని వర్మ వ్యాఖ్యానించాడు.
 
ప్రస్తుతం ఆ ఇద్దరు హీరోలు ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు మొత్తం ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో ప్రస్తుతం ఆర్జీవీ కూడా నిలిచాడు. ప్రస్తుతం సినిమా మేకింగ్‌లో 70 శాతం హీరోలకు రెమ్యునరేషన్‌ పోతుందన్న మంత్రుల వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. మంత్రులు పేర్నినాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశాడు. 
 
ఇక సినిమాకు అయ్యే ఖర్చులో సినిమా హీరోల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది అన్నారు. నిర్మాత ఎవరైనా నష్టాలు వస్తాయనే ఉద్దేశంతో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయరని ఆర్జీవీ గుర్తు చేశారు. హీరోకి అంత డబ్బులు ఇస్తున్నారంటే.. అతడిని చూసిని అభిమానులు వస్తారనే నమ్మకంతోనే అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రుషికొండ ప్యాలెస్‌‌ను నాకు అమ్మేయండి లేదా లీజుకు ఇవ్వండి?

బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కనే యువతిపై అత్యాచారం చేసి హత్య

బీజేపీలోకి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. లాబీయింగ్ జరుగుతుందా?

తిరుమల క్యూలైన్లలో అన్నప్రసాదం.. లడ్డూ నాణ్యతపై కూడా దృష్టి

శపథాలు చేసి మరీ సగర్వంగా సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు - పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments