Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం ఏమైనా చేస్తావా నాగ్? అయితే, అమల - సమంతలను హౌస్‌కు పంపిండి...

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (16:06 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునపై జర్నలిస్టు శ్వేతారెడ్డి మండిపడ్డారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారా అంటూ నాగార్జునను నిలదీశారు. పైగా, డబ్బే ముఖ్యమనుకుంటే.. మీ భార్య అమల, కోడలు సమంతలను బిగ్‌బాస్ హౌస్‌కు పంపించాలని ఆమె డిమాండ్ చేశారు. అపుడు మరింత ఎక్కువగా వస్తాయని వ్యాఖ్యానించింది.
 
ప్రస్తుతం బిగ్ బాస్ 3 రియాల్టీ షో ప్రముఖ చానెల్‌లో ప్రసారమవుతోంది. దీనికి హోస్ట్‌గా ప్రముఖ నటుడు నాగార్జున వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ బిగ్ బాస్ ఓ బ్రోతల్ హౌస్ అనీ, అవకాశాల పేరుతో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందంటూ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, బిగ్ బాస్‌పై అనేక మంది అమ్మాయిలు పలు రకాలైన ఆరోపణలు చేస్తున్నా నాగార్జున ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఆయనకు రవ్వంత కూడా సామాజిక బాధ్యత లేదన్నారు. 
 
అలాగే, నాగార్జున తన తాజా చిత్రం "మన్మథుడు-2" చిత్రంపై చూపిస్తున్న ప్రమోషన్‌పైనే అమితాసక్తిని చూపుతున్నారంటూ మండిపడ్డారు. పైగా, డబ్బే ప్రధానమనుకుంటే అమల, సమంతలను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాలని శ్వేతారెడ్డి సవాల్ విసిరారు. 
 
నాగార్జున ఓ దొంగలా దాక్కుంటున్నారనీ, ఆయన ఎలాంటి తప్పు చేయకపోతే తాము చేస్తున్న ఆరోపణలపై స్పందించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. డబ్బు కోసం ఏమైనా చేస్తావా నాగార్జునా? మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని శ్వేతారెడ్డి సూచించారు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments