Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (17:47 IST)
బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మికి గత నెలలో మైనర్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో రష్మీకి ఏమైందంటూ ఆమె అభిమానులు పరేషాన్ అయ్యారు. అదేసమయంలో తనకు జరిగిన సర్జరీపై ఆమె ఓ పోస్టు చేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన వైద్యులు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 
 
"ఇలాంటి క్లిష్ట సమయంలో నాకెంతో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు, సుమారు 5 రోజుల్లోనే నా శరీరంలోనే హిమోగ్లోబిన్ శాంతి తొమ్మిదికి పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరిగిందో అర్థం లేదు. తీవ్రమైన భుజం నొప్పి, అకాల రక్తస్రావంతో ఇబ్బందిపడుతూ వచ్చాను. ఈ కారణంగా గత నెల 29వ తేదీ నాటికి పూర్తిగా నీరసించిపోయాను. వర్క్ పరమైన కమిట్‌మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆస్పత్రిలో చేరా. ఏప్రిల్ 18వ తేదీన చిన్నపాటి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నా. మరో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలి అని ఆమె తన ఇన్‌‌స్టా ఖాతాలో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు సర్జరీకి ముందు దిగిన ఫోటలను కూడా జతచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments