పుష్ప-2 నుండి 'పీలింగ్స్' పాటను ఏపికి చెందిన మహిళ అద్భుతంగా పాడిన వీడియో వైరల్ అవుతోంది.
ఆమె ఇటీవలి మ్యూజిక్ రీల్కి 36,000 వీక్షణలు వచ్చాయి. చాలామంది ఆమెను ప్రశంసించారు. సోషల్ మీడియాకు సామాన్య ప్రజలను రాత్రికి రాత్రే సంచలనాలుగా మార్చే శక్తి ఉంది. దీనికి కావలసిందల్లా ప్రతిభ. అందుకే ప్రతిభ వున్న వాళ్లను సోషల్ మీడియా గుర్తిస్తుందని చెప్పాలి. అలాగే ఏపీకి చెందిన మహిళ పీలింగ్స్ పాట పాడి పాపులర్ అయ్యింది. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, రావులపాలెంకు చెందిన స్వాతి నారాయణ రెడ్డి అనే మహిళ.. తన మ్యూజిక్ రీల్స్తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. తన ఇంపైన గాత్రంతో భారతీయ సినీ పాటలను పునఃసృష్టించే వీడియోను షేర్ చేయడంతో నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది.
ఆమె ఇటీవలి వీడియోలో, ఆమె క్యాజువల్గా సోఫాలో కూర్చుని, అల్లు అర్జున్-రష్మిక మందన్న చిత్రం 'పుష్ప 2'లోని తెలుగు పాట 'పీలింగ్స్' లిరిక్స్ను వింటూ పాడింది.
తెల్లటి పొడవాటి కుర్తా ధరించి, ఆమె ఆ పాటను అద్భుతంగా పాడింది. ఆమె ఇటీవలి మ్యూజిక్ రీల్కి 36,000 వీక్షణలు వచ్చాయి.
అంతకుముందు, ఆమె కొలంబియన్ గాయని షకీరా వాకా వాకాను పునఃసృష్టించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఆమెకు కీర్తిని తెచ్చిపెట్టింది. 7.8 మిలియన్ల వీక్షణలు, వేల లైక్లను సంపాదించింది.