Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపదలో ఉంటే కాపాడేది జనం కాదు.. మన మనోబలమే... ట్రిపుల్ "ఏ" టీజర్

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (13:10 IST)
మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
'ముగింపు రాసుకున్న తర్వాతే కథ మొదలుపెట్టాలి... మనకు నిజమైన ఆపద వచ్చినపుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మన బలం' అంటూ వచ్చే సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. 'కిక్' తర్వాత ఇలియానా మరోసారి రవితేజకు జోడీగా నటిస్తోంది.
 
'వెంకీ', 'దుబాయ్‌ శీను' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వస్తున్న రవితేజ, శ్రీనువైట్ల కాంబో మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ర‌వితేజ మూడు పాత్రలని ప‌రిచ‌యం చేస్తూ విడుదల చేసిన వీడియో అభిమానుల‌ని అలరిస్తోంది. 
 
ఈ చిత్రంలో సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

పూజ చేస్తూ కుప్పకూలిపోయిన పూజారి.. అంబులెన్స్ దొరకలేదు.. వైద్యులు లేరు..?

Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్లూరి

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments