Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీకి మరో రెండేళ్లు కష్టకాలమే : అల్లు అరవింద్

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:02 IST)
ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే మరో రెండేళ్ల వరకు సినీ ఇండస్ట్రీకి కష్టకాలం తప్పదని ప్రముఖ నిర్మాత, గీతా అర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే.. వచ్చే రెండేళ్ళ వరకు సినిమా థియేటర్లు ప్రేక్షకులతో హౌస్‌ఫుల్ కావడం అసాధ్యమని ఆయన అంచనా వేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌కు మందు లేదా వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రసక్తే లేదన్నారు. అప్పటివరకు ప్రేక్షకులు ఇంట్లోనే వివిధ ప్లాట్‌ఫ్లామ్స్‌పై సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారని తెలిపారు. 
 
ముఖ్యంగా, ఈ పరిస్థితి చిన్న నిర్మాతలకు చాలా కష్టంగా ఉంటుందన్నారు. చిన్న నిర్మాతలు ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడం, సినిమాలు నిర్మించడం అసాధ్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగి తిరిగి పాత రోజులు రావాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments