మామయ్య జగన్ అంటే.. కోడలు జై తెలుగుదేశం అంటోంది.. ఏంటి పరిస్థితి?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:36 IST)
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇటీవల సినీనటుడు అక్కినేని నాగార్జున కలిసిన సంగతి తెలిసిందే. అయితే తాను జగన్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కింగ్ నాగార్జున వివరణ కూడా ఇచ్చుకున్నారు. అంతేకాకుండా తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని కూడా తేల్చేశారు.


జగన్ తనకు మంచి స్నేహితుడని, వైఎస్ కుటుంబంతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కానీ నాగార్జున ఇలా చెప్పినా జగన్‌కు కింగ్ పరోక్షంగా మద్దతు తెలిపారని టాలీవుడ్‌ టాక్ వస్తోంది. 
 
ఇలా మామయ్య జగన్ వైపు వుంటే కోడలు మాత్రం జై తెలుగుదేశం అంటోంది. నాగార్జున కోడలు, హీరోయిన్ సమంత సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ''నేను మీ సమంత.. మన రేపల్లె మన అన్నగారు.. అభివృద్ధికి ఓటేయండి.. అనగాని సత్య ప్రసాద్‌ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు’ అంటూ సమంత రేపల్లె టీడీపీ అభ్యర్ధి సత్యప్రసాద్‌ని గెలిపించమని ఆ వీడియోలో ప్రజలను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments