Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామయ్య జగన్ అంటే.. కోడలు జై తెలుగుదేశం అంటోంది.. ఏంటి పరిస్థితి?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:36 IST)
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇటీవల సినీనటుడు అక్కినేని నాగార్జున కలిసిన సంగతి తెలిసిందే. అయితే తాను జగన్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కింగ్ నాగార్జున వివరణ కూడా ఇచ్చుకున్నారు. అంతేకాకుండా తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని కూడా తేల్చేశారు.


జగన్ తనకు మంచి స్నేహితుడని, వైఎస్ కుటుంబంతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కానీ నాగార్జున ఇలా చెప్పినా జగన్‌కు కింగ్ పరోక్షంగా మద్దతు తెలిపారని టాలీవుడ్‌ టాక్ వస్తోంది. 
 
ఇలా మామయ్య జగన్ వైపు వుంటే కోడలు మాత్రం జై తెలుగుదేశం అంటోంది. నాగార్జున కోడలు, హీరోయిన్ సమంత సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ''నేను మీ సమంత.. మన రేపల్లె మన అన్నగారు.. అభివృద్ధికి ఓటేయండి.. అనగాని సత్య ప్రసాద్‌ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు’ అంటూ సమంత రేపల్లె టీడీపీ అభ్యర్ధి సత్యప్రసాద్‌ని గెలిపించమని ఆ వీడియోలో ప్రజలను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)

Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments