Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వెయ్యని వారు దాంతో సమానమంటున్న మెహరీన్..

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (20:13 IST)
ఎన్నికలు వచ్చేశాయి. మరో రెండురోజులు మాత్రమే సమయముంది. ఎపిలో జరుగుతున్న ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండటంతో విశ్లేషకులే ఆశక్తిగా తిలకిస్తున్నారు. అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కూడా ఇప్పటికే కల్పించారు.
 
అయితే ఓటు గురించి సినీ నటి మెహరీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఒక నటిని. ఎప్పుడూ బిజీగా ఉంటాను. నేను పుట్టింది పంజాబ్ అయినా నా ఓటు అక్కడ ఉన్నా నేను ఎన్నికలప్పుడు మాత్రం మా ప్రాంతానికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుని వస్తాను. ఓటు విలువ నాకు బాగా తెలుసు. నాకు బాగా గుర్తుంది 18 యేళ్ళ వయస్సు నాకు నిండిన తరువాత అదే సంవత్సరం ఎన్నికలు కూడా వచ్చాయి. 
 
నేను ఎంతో ఆసక్తితో ఓటు హక్కును వినియోగించుకున్నాను. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఓటు ఎంతో కీలకమైనది. దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కును వినియోగించుకోలేని వారిని కొన్ని జంతువులతో పోలుస్తారు. అది నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదో ముందు తెలుసుకోండి. ఓటును అమ్ముకోకండి.. నమ్ముకోండి అంటూ మెహరీన్ చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments