Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు 'బిల్లా'లు ఒకేచోట.. కలిసి రెండు గంటల పాటు..

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (19:54 IST)
'బాహుబలి' తర్వాత విడుదల కానున్న ప్రభాస్ మూవీ 'సాహో' షూటింగ్ పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ప్రభాస్‌తో జతకడుతున్నారు. భారీ యాక్షన్ మూవీగా యువ దర్శకుడు సుజిత్ రూ.200 కోట్ల బడ్జెట్‌తో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. 
 
ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినందున ఆ సమయంలోపు పూర్తి చేయడానికి అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సాహో' సెట్స్‌ను సడెన్‌గా విజిట్ చేయడానికి ఒక స్టార్ హీరో వచ్చారు. ఆయన ఎవరో కాదు తమిళ్ 'బిల్లా' అజిత్.
 
తమిళ స్టార్ హీరో అజిత్ 'సాహో' సెట్స్‌కు రాగానే ప్రభాస్‌తో సహా అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ సెట్స్‌లో రెండు గంటలకు పైగా సరదాగా కాలం గడిపారట. మంచి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న హీరో అజిత్, 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరి మధ్య మరో పోలిక ఏమిటంటే, ప్రభాస్ తెలుగులో 'బిల్లా' సినిమా చేస్తే, తమిళంలో 'బిల్లా'గా అజిత్ నటించారు. ఇక్కడి నుండి నేరుగా అజిత్ 'మరక్కార్' చిత్రం షూటింగ్ సెట్స్‌ను కూడా సందర్శించారట.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments