Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా మేనల్లుడితో ఐశ్వర్యా రాజేష్.. నివేదా ప్లేసులో తీసుకున్నారా?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (13:05 IST)
మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. వరసగా సినిమాలు ఫట్ అవుతున్న క్రమంలో చిత్రలహరి సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. చిత్రలహరి ఇచ్చిన జోష్‌తో మారుతీ దర్శకత్వంలో ప్రతి రోజు పండగే అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్నాడు. 
 
ప్రస్తుతం సోలో బ్రతుకే సోబెటర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సాయిధరమ్ తేజ్.. దర్శకుడు దేవ కట్టతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమా కూడా దేవకట్ట తెరకెక్కించిన ప్రస్థానం సినిమాలా ఎమోషనల్ పొలిటికల్ డ్రామా అని అంటున్నారు. ఈ సినిమాలో తేజ్ సరసన నివేదా పెథురాజ్ హీరోయిన్‌గా ఎంపిక చేసారని గతంలో వార్తలు వినిపించాయి.
 
ప్రస్తుతం తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ అంటూ ఫిలిం నగర్‌లో మాట్లాడుకుంటున్నారు. తేజ్ సినిమాకోసం ఐశ్వర్య సైన్ కూడా చేసిందని టాక్. ఐశ్వర్య ఇటీవల క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి 'వరల్డ్ ఫేమస్ లవర్'లో కనిపించింది. 
 
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తేజ్ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఐశ్వర్య రాజేష్ అయితే సరిగ్గా సరిపోతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments