Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కంట్లో కన్నీరు ఇంకిపోయింది.. తీసుకెళ్లమని దేవుడిని ప్రార్థించా... సంజనా గల్రానీ

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (11:14 IST)
కన్నడ చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హీరోయిన్లలో సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కోర్టు బెయిలుపై జైలునుంచి బయటకు వచ్చారు. అయితే, జైలు నుంచి విడుదలైన సంజనా గల్రానీ తాజాగా మీడియాతో మాట్లాడారు. 
 
"నేను కొన్ని నెలలుగా ఏడుస్తూనే ఉన్నాను. నా కంట్లో కన్నీరు కూడా ఇంకిపోయిందేమో. నన్ను ఇంతగా కష్టపెట్టే బదులు తీసుకెళ్లి పొమ్మని భగవంతుడిని ప్రార్థించాను" అని చెప్పుకొచ్చింది. 
 
తాను వెళుతున్న మార్గం చాలా రఫ్‌గా ఉంటుందని తనకు తెలిసిందని, దాన్ని దాటేసి, తిరిగి ఎప్పటిలా పైకి ఎగరాలనుందని ఆమె చెప్పింది. భారత న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందని తెలిపింది. 
 
తనకు లాక్డౌన్ సమయంలో నిశ్చితార్థం జరిగిందని చెప్పారు. లాక్డౌన్ కారణంగా నిశ్చితార్థాన్ని ప్రకటించలేకపోయానని, ఇప్పుడు వివాహాన్ని కూడా చిన్న వేడుకలా మాత్రమే చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఏదైనా చారిటబుల్ ట్రస్టులో తమ పెళ్లి జరుగుతుందని సంజన వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments