Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీరియల్ నటితో భర్త రాసలీలలు.. భర్తలో మార్పు లేదు..

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (17:31 IST)
divya sridhar
కోలీవుడ్ సీరియల్ నటి దివ్యా శ్రీధర్ వార్తల్లో నిలిచింది. తన భర్త ఆర్నావ్ నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణహాని వుందని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
 
వివరాల్లోకి వెళితే.. తమిళ్ సీరియల్ సెవ్వంధీతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్య. సీరియల్‌లో తనతో పాటు నటించిన ఆర్నావ్‌తో ప్రేమలో పడింది. కొన్నేరోజులు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టారు.
 
అయితే ఆర్నావ్ కొన్ని నెలలు బాగానే ఉన్నా ఆ తరువాత మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం దివ్యకు తెలియడంతో అందరి ముందు భర్తను నిలదీసి తమ పెళ్లిని లీగల్ చేస్తూ గుడిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆర్నావ్‌లో మార్పు రాలేదు. 
 
మరో నటితో రాసలీలలు చేస్తూ దివ్య కంటపడ్డాడు. దీంతో ఆమె మరోసారి అతడిని నిలదీయడంతో అతడు ఎదురుతిరిగాడు. ఆమెను, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపడానికి ప్రయత్నించడంతో ఆమె పోలీసుల సాయం కోరింది.
 
తన భర్త వేరొక నటితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను వదిలించుకోవాలనిచూస్తున్నాడని, అతని వలన తనకు, తన బిడ్డకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో తెలిపింది. 
 
ఇక దివ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం దివ్య అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments