Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (14:20 IST)
ఇటీవలి కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంలో నటించిన ఈ అందాల బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు తెరపై మెరిసిన పొడగరి భామలలో ఒకరుగా నిలవడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆ సినిమాలో గ్లామర్ పరంగా ఆమె చేసిన మాయజాలాన్ని ప్రేక్షకులు మరిచిపోలేదు.
 
ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీకి రామ్ సినిమాలో ఛాన్స్ దక్కింది. రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ - ఫీల్ గుడ్ వారు కలిసి ఒక ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళుతున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకి దర్శకత్వం వహించిన మహేశ్ బాబు పి, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కెరియర్ పరంగా రామ్‌కి ఇది 22వ సినిమా.
 
కొంతకాలంగా రామ్‌ను వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆయనను కాపాడలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమాను అంగీకరించాడు. ఈ సినిమా హిట్ రామ్‌తో పాటు భాగ్యశ్రీకి కూడా చాలా అవసరమే. ఈ సినిమాతో హిట్ దొరికితే ఈ సుందరి హవా కొనసాగే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments