కెప్టెన్ సమాధి వద్ద బోరున విలపించిన కోలీవుడ్ హీరో!!

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (17:34 IST)
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ హీరో కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. ఆయన అంత్యక్రియల సమయంలో అనేక మంది కోలీవుడ్ హీరోలు చెన్నై నగరంలో లేరు. తమతమ వ్యక్తిగత పనులు, చిత్రాల షూటింగుల కారణంగా విదేశాలకు వెళ్లారు. వీరంతా చెన్నైకు తిరిగి వచ్చిన తర్వాత నేరుగా కెప్టెన్ విజయకాంత్ సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటిస్తున్నారు. ఈ క్రమంలో హీరో సూర్య కూడా విదేశాల నుంచి తిరిగి వచ్చి నేరుగా కెప్టెన్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయకాంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. 
 
విజయకాంత్ మరణం తనకు ఎంతో షాక్‌కు గురిచేసిందన్నారు. కెరీర్ ఆరంభంలో నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ తనకు గుర్తింపు రాలేదన్నారు. ఆ సమయంలో "పెరియన్నా" చిత్రంలో విజయకాంత్‌తో కలిసి పని చేశారని తెలిపారు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేయాలని ఆయన తనను ప్రోత్సహించేవారని చెప్పారు. 
 
అందరితో ఎంతో మంచిగా మాట్లాడేవారని, ఆయన మరణం చిత్ర సీమకు తీరని లోటని హీరో సూర్య అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత తన తండ్రి, నటుడు శివకుమార్, తమ్ముడు, హీరో కార్తీతో కలిసి చెన్నై సాలిగ్రామంలోని విజయకాంత్ నివాసానికి వెళ్లి... కెప్టెన్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత కెప్టెన్ సతీమణి ప్రేమలత, ఇద్దరు కుమారులను ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్య రాత్రులు నాగినిగా మారి కాటేస్తోంది : భర్త ఫిర్యాదు

Karur stampede: వాలంటీర్ ఫోర్స్‌ను బరిలోకి దించనున్న టీవీకే చీఫ్ విజయ్

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తాం.. చంద్రబాబు

కాకినాడలో లారీని ఓవర్ టేక్ చేయబోయి.. లారీ కింద పడ్డాడు.. ఆ తర్వాత ఏం జరిగింది? (video)

నేనూ భారతీయుడినే.. అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నా... పెళ్లి పేరుతో మహిళకు రూ.2.5 కోట్ల కుచ్చుటోపీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments