Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొమ్మిదో తరగతి చదివే కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం..

rape

ఠాగూర్

, శుక్రవారం, 5 జనవరి 2024 (16:59 IST)
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదవుతున్న కన్నబిడ్డపై కామంతో కళ్లు మూసుకునిపోయిన కన్నతండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది బీహార్ నుంచి నగరానికి పొట్టకూటి కోసం వలస వచ్చిన కసాయి వ్యక్తి కావడం గమనార్హం. 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక ఫ్యామిలీ కుత్బుల్లాపూర్‌కు కొన్నేళ్ళ క్రితం వలస వచ్చింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతుంది. వయసు 14 యేళ్ళు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఆ బాలిక పాఠశాలకు వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటున్న వయసుకొచ్చిన కుమార్తెపై కన్నేసిన కసాయి తండ్రి.. నయానా భయానో లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడసాగాడు. 
 
పైగా, ఈ విషయం తల్లితో సహా ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. అయితే రోజు రోజుకూ తండ్రి ఆగడాలు హెచ్చుమీరిపోవడంతో కన్నతల్లి దృష్టికి తీసుకెళ్లింది. అయితే కన్నబిడ్డ మాటలు ఆ తల్లి నమ్మలేదు. పైగా తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ కోపగించుకుంది.  ఆ తర్వాత తన స్నేహితుడి ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు... ఐటీ నగరంపై వైరస్ పంజా